EPAPER

Baby 2.0: బేబీ -2 స్టోరీ ఇదేనా..? పోస్టర్ వైరల్..

Baby 2.0:  బేబీ -2 స్టోరీ ఇదేనా..? పోస్టర్ వైరల్..

Baby 2.0: ఎటువంటి హడావిడి లేకుండా చిన్న సినిమాగా విడుదలై రికార్డ్ సృష్టించిన మూవీ బేబీ. యువతకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవ్వడంతో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. వైవిధ్యమైన కథ తో పాటు నేటి యువత ఎదుర్కొంటున్నటువంటి సన్నివేశాలను ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ సాయి రాజేష్ సక్సెస్ సాధించాడు. తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టించి 100 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ లో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది.


బేబీ మూవీలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో పాటు వైష్ణవి చైతన్య కూడా బాగా పాపులర్ అయింది. ఇక రీసెంట్ గా వీళ్ళిద్దరికీ సంబంధించి సరికొత్త చిత్రానికి పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ బేబీకి సీక్వెల్ మూవీ బేబీ 2 అంటూ నెటిజన్స్ తెగ వైరల్ చేశారు. దీనికి తోడు సాయి రాజేష్ బేబీ 2 స్టోరీ ఇదే అంటూ.. కాన్సెప్ట్ లీక్ చేశాడు. మరి ఆ స్టోరీ వివరాలేమిటో తెలుసుకుందాం పదండి..

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ గా మారిన ఆనంద్ దేవరకొండ ,వైష్ణవి చైతన్య కు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బేబీ మూవీ లో వైష్ణవి చేసిన క్యారెక్టర్ కి నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి అన్న వాదన వినిపించినప్పటికీ ఈ మూవీలో ఎంతో బ్యాలెన్స్ గా నటించింది అన్న క్రెడిట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా మరో సరికొత్త చిత్రం ప్రకటించడం జరిగింది. అయితే ఈ మూవీకి కూడా స్టోరీ అందిస్తున్నది బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ కావడం మరొక విశేషం. ఇక ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలను రవి నంబూరి నిర్వహించనున్నారు.


ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది అంటూ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసి తెలిపారు. 2024 సమ్మర్ లో హాలిడే ట్రీట్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బేబీ 2 అంటూ చాలామంది ప్రచారం చేశారు. దీనికి స్పందించిన సాయి రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ పోస్టర్ని పోస్ట్ చేయడంతో పాటు సుదీర్ఘమైన ఒక బేబీ 2 స్టోరీని కూడా రాసుకువచ్చారు. అయితే ఆ స్టోరీ విని కొందరు ప్రేమ కథను చివరికి దెయ్యాల కథ చేస్తున్నారే అని అంటున్నారు.

ఇంతకీ బేబీ 2 స్టోరీ ఏమిటంటే.. ఈ మూవీలో ఆనంద్ చనిపోతాడు. బేబీ స్టోరీ ఎండింగ్ లో మనం వైష్ణవికి పెళ్లయినట్టు చూసాం కదా.. ఆమె మీద కోపంతో విరాజ్ ఇక సెకండ్ పార్ట్ లో పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో వైష్ణవి ని కాపాడడానికి ఆనంద్ ఆత్మ ఆమె భర్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక ఆనంద్ అత్మ విరాజ్ బారి నుంచి వైష్ణవిని ఎలా కాపాడుతుంది అనేది బేబీ 2 కథ.. అంటూ సాయి రాజేష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగా సినిమా స్టోరీ అదేనా లేక వైరల్ అవుతున్న న్యూస్ కి తన స్టైల్ రిప్లై ఇచ్చాడో తెలియదు కానీ మొత్తానికి సాయి రాజేష్ చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంది. దీంతో చాలామంది సీక్వెల్ తీస్తేనే బాగుంటుంది అంటూ సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు.

Related News

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Sobhita Dhulipala: అక్కినేని కోడలా.. మజాకానా.. ఎమ్మీ అవార్డ్స్ కు శోభితా బోల్డ్ సిరీస్

Chiranjeevi : పక్కొడి పనిలో వేలు పెడుతారు… చాలా కాన్ఫిడెంట్‌గా చిరుకి కౌంటర్

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగర్జున వ్యాఖ్యలు వైరల్

Renu Desai: ప్లీజ్ సాయం చెయ్యండి.. హెల్ప్‌లెస్‌గా ఉన్నాను.. రేణు దేశాయ్ వేడుకోలు

Jani Master : జానీకి రిమాండ్ విధించిన కోర్టు… బెయిల్ పరిస్థితి ఏంటంటే..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Big Stories

×