Congress : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తనదైన శైలిలో దూకుడు పెంచింది హస్తం పార్టీ. ఆరు గ్యారెంటీ పథకాలతో తెలంగాణలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోవైపు NRI సెల్ యూకే ఆధ్వర్యంలో లండన్లో ప్రచారం ప్రారంభించారు. ఆరు గ్యారెంటీ పథకాలు, నూరు సీట్లు గ్యారంటీ అంటూ లండన్లో ఆరు-నూరు కార్యక్రమం చేపట్టింది టీపీసీసీ NRI సెల్ యూకే. ఈ కార్యక్రమంలో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్బాబు వర్చువల్గా పాల్గొన్నారు.
యువత, మహిళలు, రైతులకు ఇవ్వబోయే వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు శ్రీధర్బాబు. విద్యార్థుల కోసం 5 లక్షల ఏటీఎం కార్డు.. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అధికారంలోకి రాగానే మెగా DSC ప్రకటించి ఏక కాలంలో భారీ సంఖ్యలో ఉద్యోగ భర్తీ చేపడుతామన్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు, NRI సెల్ ఏర్పాటుపై మేనిఫెస్టోలో పొందుపర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు శ్రీధర్బాబు.
వచ్చే ఎన్నికల్లో ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్లి వంద సీట్లలో గెలుపే లక్ష్యంతో ముందుకెళ్తామన్నారు టీపీసీసీ NRI సెల్ యూకే కన్వీనర్ వేణుగోపాల్. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది.