Konda Surekha : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ బైక్ నడుపుతూ కిందపడిపోయారు. స్వల్ప గాయాలతో సురేఖ బయటపడ్డారు. మేడిపల్లి సమీపంలో స్కూటీ అదుపుతప్పడంతో ఆమె చేతులకు, ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి.
విజయభేరి బస్సు యాత్రలో భాగంగా చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు కొండా సురేఖ. భూపాలపల్లి నుంచి ర్యాలీ కొనసాగుతుండగా.. మేడిపల్లి సమీపంలో స్కూటీ అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో చికిత్స కోసం వెంటనే సురేఖను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేఖ చూసి ఆమె భర్త మురళి.. భావోద్వేనికి గురయ్యారు. ఊహించని ఘటనతో కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.