seethakka : ములుగు నియోజకవర్గంలో నిర్వహించి కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో ఎమ్మెల్యే సీతక్క సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆమె పేరు స్టేజ్ పై వినిపించిన ప్రతిసారి సభలో కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్తలు బాగా స్పందించారు. గట్టి చప్పట్లు కొడుతూ , విజిల్స్ వేస్తూ ఆమెకు మద్దతు ప్రకటించారు. సీతక్కపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
సీతక్కను 50 వేల మెజార్టీ గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సమయంలోనే సభా ప్రాంగణం దద్దరిల్లింది. ప్రియాంక గాంధీ సీతక్క పేరు ప్రస్తావించగానే సభా ప్రాంగణంలో మరోసారి దద్ధరిల్లింది. సీతక్కకు ఉన్న ఫాలోయింగ్ చూసి వేదికపై ఉన్న నేతలు ఆశ్చర్యపోయారు.
కాంగ్రెస్ బహిరంగ సభలో మాట్లాడేందుకు సీతక్క మైక్ ముందుకు వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు హర్షద్వానాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీతక్క విమర్శలు గుప్పించారు. పేదలను మరింత పేదలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను గులాబీ పార్టీ కాపీ కొట్టిందని ఆరోపించారు. ఓరుగల్లు అంటేనే.. పోరాటాల గడ్డ అన్నారు.కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని స్పష్టం చేశారు. తను ఓడించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పార్ట కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకులు అసెంబ్లీ ఉండకూడదన్నదే ఆ పార్టీ లక్ష్యమని మండిపడ్డారు.