Congress Vijayabheri Yatra : ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మరోసారి తెలంగాణలో జోరు చూపించనున్నారు.ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న వారికి కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. జానపద కళాకారులు నృత్యాలతో స్వాగతించారు. అక్కడి నుంచి..ప్రత్యేక హెలికాఫ్టర్ లో ములుగుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో రామప్ప ఆలయానికి వెళ్లారు. ఆలయ చరిత్ర గురించి, శిల్పశైలిని గురించి అక్కడి పురోహితులను అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క స్వాగతం పలికారు. రామప్ప ఆలయంలో.. ఆ ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఇరువురికి ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ బాహ్య ప్రదేశాల్లో ఉన్న కట్టడాలను, ఆలయ గోడలపై చెక్కి ఉన్న శిల్పాలను రాహుల్, ప్రియాంక సందర్శించారు. అక్కడి నుంచి రామానుజపురం లో జరిగే భారీ బహిరంగ సభకు పయనమయ్యారు.