Shanghai Masters 2023: చైనాలో జరుగుతున్న షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ లో భారత సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న జోడీ రన్నరప్ గా నిలిచింది. బోపన్నకు జోడిగా ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్ ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఫైనల్ మ్యాచ్ లో మార్కెట్ గ్రానొల్లర్స్ (స్పెయిన్) -హెురాకియో జెబలాస్ ( అర్జెంటీనా) జోడీ చేతిలో ఓటమి పాలయయ్యారు. చివరికి రన్నరప్ గా నిలిచారు. 7-5, 2-6, 7-10 సెట్లతో హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో బోపన్న జోడి చివరివరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
రన్నరప్ గా నిలిచిన బోపన్న-ఎబ్డెన్ లకు 2, 31, 660 డాలర్లు ( ఒక కోటీ 93 లక్షల రూపాయలు) ప్రైజ్ మనీ లభించింది. అంతేకాదు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో జరగనున్న సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్కు వీరు అర్హత సాధించారు. 43 ఏండ్ల బోపన్న ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్లో గోల్డ్ మెడల్ నెగ్గిన సంగతి అందరికీ తెలిసిందే.