Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్ పిటిషన్ల పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన ఏపీ హై కోర్టును ఆశ్రయించారు.ఏసీబీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ..హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కేవలం రాజకీయ ప్రతీకార చర్యతోనే తనను ఇరికించారని చంద్రబాబు పిటిషన్లో తెలిపారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. చంద్రబాబు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.
ఇక అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు ..ఫైబర్ నెట్ కేసులో దాఖలైన పీటి వారెంట్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పును చెప్పనుంది. ఫైబర్ నెట్ స్కాంలో పీటి వారెంట్ విచారణ సందర్భంగా.. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబును కోర్టులో హాజరు పరచాలని సీఐడీ తరపు న్యాయవాది కోరారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో నిన్న పీటి వారెంట్ పై వాదనలు ముగిశాయి. దీనిపై నేడు ఏసీబీ కోర్టు తీర్పును వెలవరించనుంది.