NOBEL PEACE PRIZE: ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు అందరికీ మానవ హక్కులు స్వేచ్ఛను పెంపొందించడానికి ఆమె చేసిన పోరాటానికి నర్గీస్ మొహమ్మదీకి 2023 నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయించింది. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనకు సరిగ్గా 2023 కి 75 సంవత్సరాలు.నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 19వ మహిళగా,2003లో ఈ అవార్డును గెలుచుకున్న మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాది తర్వాత రెండవ ఇరాన్ మహిళ మహమ్మదీ కావడం గమనార్హం.
2019 హింసాత్మక ఘటనలోని బాధితురాలి స్మారకానికి హాజరైన తర్వాత ఇరాన్ ప్రభుత్వం మొహమ్మదీని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం నర్గీస్ మొహమ్మదీ 31 సంవత్సరాల జీవితఖైదుని అనుభవిస్తున్నారు. మొహమ్మదీ యొక్క ధైర్యపోరాటానికి ఫలితం 13 సార్లు అరెస్టులు, 154 కొరడా దెబ్బలు,31 సంవత్సరాల ఖైదు. ఇదే సంవత్సరం ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్’ బహుమతికి నర్గీస్ ఎంపికైంది.ఈ సంవత్సరానికి గానూ మొత్తం 351 నామినేషన్లు రాగా, ఈ అవార్డును నర్గీస్ మొహమ్మదీని ఎంపిక చేసారు.జైలు శిక్షకు ముందు, మొహమ్మదీ ఇరాన్లోని నిషేధించబడిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు.
గత సంవత్సరం బహుమతిని ఉక్రెయిన్, బెలారస్ ,రష్యా నుండి మానవ హక్కుల కార్యకర్తలు గెలుచుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అతని బెలారసియన్ కౌంటర్, మిత్రదేశానికి బలమైన మందలింపుగా భావించబడింది. ఇంతకుముందుఈ బహుమతి పొందిన వారిలో ప్రముఖులైన నెల్సన్ మండేలా, బరాక్ ఒబామా, మిఖాయిల్ గోర్బచేవ్, ఆంగ్ సాన్ సూకీ ఉన్నారు.
నోబెల్ శాంతి బహుమతి దేశాల మధ్య సౌభ్రాతృత్వం కోసం, స్టాండింగ్ ఆర్మీలను రద్దు చేయడం లేదా తగ్గించడం కోసం; శాంతి కాంగ్రెస్ లను నిర్వహించడం, ప్రచారం చేయడానికి కృషి చేసిన వారికి ఇవ్వబడుతుంది. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనలోని ప్రత్యేకత ఏమిటంటే ఈ శాంతి పురస్కారాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. మిగతా నోబెల్ బహుమతులు మాత్రం రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటిస్తుంది.