తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ తుక్కుగూడలో విజయభేరి బహిరంగ సభను సూపర్ సక్సెస్ చేసింది. కీలక హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. విజయభేరి బహిరంగ వేదికపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హామీలను ప్రకటించారు. చరిత్రాత్మకమైన రోజున రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు ఇస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు..
1.మహాలక్ష్మి పథకం..
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలనెలా రూ.2,500 పంపిణీ
పేద మహిళలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
2.రైతు భరోసా..
ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు
వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు
వరి పంటకు క్వింటాల్కు రూ.500 బోనస్
3.ఇందిరిమ్మ ఇళ్ల పథకం..
ఇందిరిమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం పంపిణీ
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం
తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పంపిణీ
4.గృహజ్యోతి పథకం..
గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్
5.చేయూత పథకం..
ఈ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా
నెలకు రూ.4 వేల పింఛన్ పంపిణీ
6.యువ వికాసం..
ఈ పథకం ద్వారా విద్యార్థులకు రూ.5 లక్షల ఆర్థికసాయం