కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ వేదికపై తెలంగాణ మహిళలకు సోనియా గాంధీ వరాలు కురిపించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేసే 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఒకే నెలలో 6 గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ స్పష్టం చేశారు.
తుక్కుగూడలోని సభా వేదికపై నుంచి తొలుత తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ నమస్కారం చేశారు. తన ప్రసంగం పూర్తైన తర్వాత రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కు శుంకుస్థాపన చేశారు.