తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లోని తుక్కుగూడ వేదికగా విజయభేరి మోగించింది. ఇక్కడ నిర్వహిస్తున్న సభకు భారీ జనం పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు. సభ ప్రాంగణం కాంగ్రెస్ శ్రేణులతో కిక్కిరిసిపోయింది.
80 ఎకరాల్లో బహిరంగసభ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. 10 లక్షల మంది వచ్చినా సరిపోయేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం మూడు వేదికలు.. 120 ఫీట్లతో మూడు వైపులా ర్యాంపులు పెట్టారు. వేదికపైకి రాగానే సోనియాగాంధీ.. పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. మధ్య స్టేజీలో సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల సీఎంలు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కుర్చున్నారు.
రెండో వేదికపై PAC, PEC, CWC సభ్యులు కూర్చున్నారు. మూడో వేదికపై DCC అధ్యక్షులు, కళాకారులు ఆశీనులైయ్యారు.