కొన్నిరోజులుగా దేవర మూవీ షూటింగ్లో బిజీబిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కాస్త గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం దుబాయ్కు పయనమయ్యాడు. అయితే అతను వెళ్లేది వెకేషన్కు అనుకుంటే పొరపాటే. దుబాయ్లో జరుగుతున్న సైమా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాడు.
శుక్రవారం నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సైమా అవార్డ్స్ వేడుక జరగనుంది. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ RRR.. 11 కేటగిరీల్లో నామినేట్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమాకు అవార్డు పంట పండటం ఖాయం. అందుకే తారక్ దుబాయ్కు వెళ్లాడు.
ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్తో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆయన అరెస్ట్పై ఇంతవరకు ఎన్టీఆర్ స్పందించలేదు. ఎందుకు మౌనం పాటిస్తున్నాడనే చర్చ నడుస్తోంది. తారక్ పై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. అయినా కానీ దేవర మూవీ షూటింగ్లోనే గడిపేశాడు.
చంద్రబాబు అరెస్ట్ అంశంపై తారక్ ఉద్దేశపూర్వకంగానే మౌనం పాటిస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు తారక్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడుకదా అంటున్నారు. కేవలం తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టాడని మద్దతునిచ్చే వారు చెబుతున్నారు. రాజకీయాల గురించి స్పందించమని ఎందుకు అడుగుతున్నారు అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు.