EPAPER
Kirrak Couples Episode 1

High Court on Bandi Sanjay: బండి సంజయ్ పై హైకోర్టు ఆగ్రహం.. ఎందుకంటే..?

High Court on Bandi Sanjay:  బండి సంజయ్ పై హైకోర్టు ఆగ్రహం.. ఎందుకంటే..?
High Court on Bandi Sanjay

Bandi Sanjay latest news(Political news today telangana):

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరీంనగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నిక వివాదం హైకోర్టులో ఉంది. ఈ కేసుపై విచారణ జరుగుతోంది. తాజాగా హైకోర్టులో జరిగిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్‌ హాజరుకాలేదు. ఆయన కోర్టుకు రాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే పలుమార్లు క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు బండి సంజయ్‌ తరఫు న్యాయవాది గడువు కోరారు.


ప్రస్తుతం బండి సంజయ్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి గడువు ఇవ్వాలని హైకోర్టుకు బండి సంజయ్ తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో బండి సంజయ్ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎన్నికల పిటిషన్లు 6 నెలల్లో తేల్చాల్సి ఉంటుంది. అందుకే విచారణ ముగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 12న బండి సంజయ్‌ హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సంజయ్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు హాజరవ్వాలంటే సైనిక సంక్షేమ నిధికి రూ. 50 వేలు చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.


Related News

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

Big Stories

×