EPAPER
Kirrak Couples Episode 1

Revanth Reddy latest Tweet: సర్వం దోచేసి.. ఇప్పుడు తగ్గింపా? కేంద్రంపై రేవంత్ సెటైర్లు..

Revanth Reddy latest Tweet: సర్వం దోచేసి.. ఇప్పుడు తగ్గింపా? కేంద్రంపై రేవంత్  సెటైర్లు..

Congress revanth reddy news(Telangana politics) :

గ్యాస్‌ సిలిండర్ ధరల తగ్గింపుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓ గజ దొంగ దారి దోపిడీ చేసి సర్వం దోచుకుని.. దారి ఖర్చులకు తిరిగి రూ. 200 ఇచ్చాడనట్లుగా కేంద్రం వ్యవహారం ఉందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో రూ. 410 ఉన్న గ్యాస్‌ సిలిండర్ ధరను రూ.1200కు పెంచి.. ఇప్పుడు రూ. 200 తగ్గించడాన్ని ఇలా కాకుండా ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.


మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటాయి. పెరిగిన రేట్స్ సామాన్యులకు పెనుభారంగా మారాయి. లీటర్ పెట్రోల్ ధర 110 రూ. దాటేసింది. ఇన్నాళ్లూ ధరలు పెరగడమే తప్ప.. తగ్గిన ధాఖలాలు కపిపించలేదు. ఓవైపు పెట్రో, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు ఇలా సామాన్యునికి పెను భారంగా మారాయి. అయితే గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించిన కేంద్రం పెట్రోల్ రేట్స్ పై మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించాలని విపక్ష పార్టీలతోపాటు సామన్యులు కోరుతున్నారు. మరి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఇంధన ధరలను కూడా తగ్గిస్తోందా?


Related News

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ యుద్దం – తనను ఎవ్వరూ ఓడించలేరని అంజు ఫోజులు

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. మరో ఇద్దరు అరెస్ట్?

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Big Stories

×