Roja: మంత్రి రోజా భర్త, దర్శకుడు సెల్వమణిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది చెన్నై జార్జ్ టౌన్ కోర్టు. గత ఎనిమిదేళ్లుగా వెంటాడుతున్న ఓ కేసు ఇప్పుడు వారెంట్ వరకూ వచ్చింది.
2016లో సెల్వమణికి ఓ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్ ముకుంద్చంద్ బోత్రాను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారంటూ సెల్వమణిపై పరువునష్టం దావా వేశారు.
అయితే.. ఈ కేసు విచారణకు సెల్వమణి హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ అయింది. అయినప్పటికీ సెల్వమణి స్పందించకపోవడంతో.. సీరియస్ అయిన కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.