మంత్రి రోజా ఇలాఖా నగరిలో వైసీపీ గ్రూపు తగాదాలు కలకలం రేపాయి. రోజాకు, కేసీ శాంతికి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు సీఎం జగన్. వారిద్దరి చేతులు కలిపారు. అయితే, జగనన్న చేతిలోంచి వెంటనే చెయ్యి లాగేసుకున్నారు మంత్రి రోజా. ఈ దృశ్యం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. జగన్ చెప్పినా రోజా తగ్గేదేలే అంటున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అదే సమయంలో కేసీ శాంతికి జగన్ అభయహస్తం అందించడం మరింత ఆసక్తికరంగా మారింది.
మంత్రి రోజాను నగరిలో అసమ్మతి రాజకీయాలు వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ అసమ్మతి వర్గాలు ఆమెకు తలనొప్పిగా మారాయి. కేజీ శాంతితోనే కాదు.. పుత్తూరులో అమ్ములు నాయకత్వం, నిండ్ర మండలంలో చక్రపాణి రెడ్డి నాయకత్వంలో అసమ్మతి ఉన్నట్టు తెలుస్తోంది. విజయపురంలో రాజు, వేడమాలపేటలో మురళి రెడ్డి నాయత్వాల్లోనూ రోజాకు వ్యతిరేకంగా ఉన్నారు.
పార్టీ శ్రేణులను కాదని.. కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే రోజాకు వ్యతిరేకత పెరిగిందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ గ్రూపు పాలిటిక్స్పై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు నగరి సభాస్థలం వద్ద రోజా, కేజీ శాంతిల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేశారు.