రాష్ట్రప్రభుత్వం ఖతర్నాక్ నిర్ణయం తీసుకుంది. స్కూల్స్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. స్టూడెంట్స్ స్కూల్కు సెల్ఫోన్స్ తీసుకురావడంపై కంప్లీట్గా బ్యాన్ వేశారు.
టీచర్లు మాత్రం పాఠశాలకు ఫోన్ తెచ్చుకోవచ్చు కానీ.. క్లాస్రూమ్స్కు మాత్రం తీసుకుపోవద్దు. టీచర్లు తమ ఫోన్స్ను హెడ్మాస్టర్ దగ్గర ఉంచాలి. రూల్స్ బ్రేక్ చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.
యునెస్కో రిలీజ్ చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. టీచింగ్కు ఆటంకం రాకుండా చూసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే స్కూల్స్లో సెల్ఫోన్స్ బ్యాన్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది విద్యాశాఖ.