కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పై… కేటీఆర్, రేవంత్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. చేవెళ్ల సభలో డిక్లరేషన్ పై కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ పెట్టగా… అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు రేవంత్.కాంగ్రెస్ చేసింది డిక్లరేషన్ కాదు.. ఫ్రష్టేషన్ అంటూ మంత్రి అభిప్రాయపడగా.. తమ డిక్లరేషన్ …దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదని రేవంత్ అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి… మూడెకరాల భూమి ఇస్తానని మేము మోసం చేయలేదంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.బీఆర్ఎస్ పార్టీ… గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేసిందని..మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులకు బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదన్నారు. నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత, బీసీ బిడ్డల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదంటూ రేవంత్ ట్వీట్లో పేర్కొన్నారు.