తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అధికార పార్టీ. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి.. టాప్ గేర్లో దూసుకెళ్తోంది. అటు టీ కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసింది. నియోజకవర్గాల వారీగా ఆశవాహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అంతే కాదు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు షురూ చేసింది. ఇందులో భాగంగా ప్రజాగర్జన పేరుతో నేడు..చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది