కరీంనగర్ జిల్లాలో మంథని ఎమ్మెల్యే శ్రీదర్బాబు గన్మెన్ మల్లయ్య మృతి కలకలం రేపుతోంది. రాత్రి వరకూ గన్మెన్ మల్లయ్య ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. గట్టుదుద్దెనపల్లి వద్ద కెనాల్లో మల్లయ్య మృతదేహం లభించడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే.. అలగనూరు కేసీ కెనాల్ వద్ద మల్లయ్య టూవీలర్ గుర్తించారు. మల్లయ్యది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా? హత్యా? ఆత్మహత్యా? అనే అనుమానం తలెత్తుతోంది. పోలీసులు అన్నిరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.