Gaddar: గద్దర్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గద్దర్ భార్య విమలకు ఆయన లేఖ రాశారు. గద్దర్ మృతి తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు.
గద్దర్ పాటలు, ఇతివృత్తాలు, సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని లేఖలో వివరించారు. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని అందించాయని చెప్పారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని మోడీ ప్రశంసించారు.
గద్దర్ చనిపోయిన సమాచారాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.