చంద్రయాన్-3పై ఇస్రో కీలక ప్రకటన చేసింది. ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్పై తాజా వివరాలు ప్రకటించింది. నిర్దేశించిన ప్రాంతానికి ల్యాండర్ విక్రమ్ బుధవారం సాయంత్రం 5.44 గంటలకు చేరుకుంటుందని తెలిపింది.
ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రక్రియ సాయంత్రం 5.44 గంటలకు ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది. సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని పేర్కొంది. అన్ని ప్రక్రియలు సవ్యంగా సాగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగుతుంది. ఆ తర్వాత రెండు గంటలకు ల్యాండర్ నుంచి రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపైకి దిగుతుంది.