PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో ఘనస్వాగతం లభించింది. ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ పాల్ షిపోకోసా మోదీకి స్వాగతం పలికారు. ఈ నెల 24 వరకు జరగనున్న 15వ బ్రిక్స్ సమావేశాల్లో మోడీ పాల్గొంటారు.
2019 తర్వాత బ్రిక్స్ దేశాధినేతలు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యం పెరిగింది. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు అవుతున్నారు. పుతిన్ బదులు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ సదస్సుకు హాజరవుతారు. అయితే ఈ సమావేశాల్లో మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య సమావేశం జరుగుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
15వ బ్రిక్స్ సదస్సు వివిధ సభ్యదేశాల మధ్య సహకారానికి సంబంధించి కొత్త రంగాలను గుర్తించడంతో పాటు.. అభివృద్ధిని సమీక్షించడానికి అవకాశం కల్పించగలదన్నారు మోడీ. బ్రిక్స్ సమావేశాలు ముగిసిన అనంతరం మోదీ.. అతిప్రాచీన నగరం గ్రీస్లో పర్యటిస్తారు. 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని గ్రీస్ను సందర్శించడం ఇదే మొదటిసారి కానుంది.