Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ చేసిన మరో ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రయాన్ 3పై ట్వీట్ చేసి ట్రోలింగ్కు గురైన ఆయన.. మరో ట్వీట్తో నెటిజన్లకు సమాధానం ఇచ్చారు.
విద్వేషం.. విద్వేషాన్ని మాత్రమే చూస్తుందంటూ తన గత ట్వీట్కు వివరణ ఇచ్చారు. తానో పాత జోకును గుర్తు చేశానని, తన గత ట్వీట్ నీల్ఆర్మ్స్ట్రాంగ్ కాలం నాటి పాత జోక్కు సంబంధించిందని తెలిపారు.
తాను కేరళ చాయ్వాలాపై పోస్టు షేర్ చేశానని, మరి ట్రోల్స్ చేసిన చాయ్వాలా ఎవరు? అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి సెటైర్ వేశారు. జోక్ను అర్థం చేసుకోలేనివారు అది తమపైనే అని అనుకుంటారని ఘాటుగా బదులిచ్చారు. కాస్త ఎదగండయ్యా.. అంటూ వ్యంగ్యంగాస్త్రాన్ని సంధించారు.
చంద్రుడిపై ల్యాండ్ అయ్యాక చంద్రయాన్ 3 పంపే తొలి ఫొటో ఇదేనంటూ ఓ చాయ్వాలా ఫొటోను ప్రకాశ్రాజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రయాన్ 3 దేశం మొత్తానికి గర్వకారణమని, రాజకీయాన్ని, దేశాన్ని వేర్వేరుగా చూడాలని హితవు పలికారు. ఒకరిని ద్వేషించడం, దేశాన్ని ద్వేషించడం మధ్య ఉన్న అంతరాన్ని తెలుసుకోవాలని సూచించారు.