Chandrayaan-3 Latest Photos : చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ లాండ్ అయ్యే ప్రదేశానికి సంబంధించి ఫోటోలను ఇస్రో రిలీజ్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే ప్రదేశం విజువల్స్ విడుదల చేసంది. భారతీయులు ఎంతో ఉత్కంఠతో ఈ చారిత్రక ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు.
జులై 14న శ్రీహరికోటలోని షార్ ప్రయోగ వేదిక నుంచి రోదసిలోకి చంద్రయాన్-3 దూసుకెళ్లింది. 40 రోజుల సుధీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ఈ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించింది.
పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగుతుంది. 2 వారాలపాటు ల్యాండర్, రోవర్.. జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు చేస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ ఘనత సాధిస్తుంది. దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త కీర్తిని భారత్ సొంతం చేసుకుంటుంది.