PGT Gurukula Exam : తెలంగాణలో గురుకుల టీచర్ పోస్టులకు ఆగస్టు 1 నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం సోమవారం పీజీటీ గురుకుల పరీక్ష నిర్వంచాలి. అయితే సర్వర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇంగ్లీష్ పరీక్ష ప్రారంభం కాలేదు. ఉదయం 8.30 గంటలకే పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. సర్వర్ సమస్య తలెత్తడంతో పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించలేదు.
సర్వర్లో సాంకేతిక సమస్య వల్లే ఎగ్జామ్ ఆలస్యమవుతోందని పరీక్షా కేంద్రాల నిర్వాహకులు అంటున్నారు. పీజీటీ ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్స్ కు అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. పరీక్ష ప్రారంభం కాకపోవడంతో హయత్నగర్లోని ఎగ్జామ్ సెంటర్ వద్ద అభ్యర్థుల నిరసన చేపట్టారు. ఆ సమయంలో హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
హైదరాబాద్ , ఖమ్మం, వరంగల్ కేంద్రాల్లో సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తాయి. గురుకుల టీచర్ పోస్టులకు ఎగ్జామ్స్ అన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నాయి.