Rail: తెలంగాణ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎస్-2 బోగీలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేసి ప్రయాణికులను దింపేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని, ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
బెంగళూరు రైల్వేస్టేషన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ప్లాట్ ఫామ్ పై ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. B1, B2 రెండు ఏసీ కోచ్ లకు మంటలు వ్యాపించాయి. భారీగా పొగ రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను చల్లార్చారు.
ఇలా ఒకేరోజు రెండు వేరు వేరు చోట్ల.. ఒకే తరహా ప్రమాదాలు జరగడం కాకతాళీయమా? అనుమానాస్పదమా? అనే కోణంలో విచారిస్తున్నారు రైల్వే అధికారులు.