Hyderabad News(Telangana Today News) : హైదరాబాద్, మాదాపూర్ నారాయణ కాలేజీ మహిళా క్యాంపస్లో ఓ యువతి సూసైడ్ చేసుకుంది. డిగ్రీ చదవుతూ కళాశాలలో అసిస్టెంట్ వార్డెన్గా పని చేస్తోంది భవాని. ఆమె కాలేజ్ రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది.
గత నెల 11నే కళాశాలలో చేరిన భవాని ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే తమకు ఎలాంటి సమాచారం అందించలేదని కాలేజ్ యాజమాన్యంపై మండిపడుతున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.