TS Liquor Shop Tenders( Latest News in Telangana ) : తెలంగాణ సర్కార్కు లిక్కర్ టెండర్ల ద్వారా ఫుల్లు కిక్ వచ్చేసింది. మద్యం టెండర్లలో ఎక్సైజ్ శాఖ టార్గెట్ రీచ్ అయింది. మొత్తం 2 వేల 6 వందల 20 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ టెండర్లు పిలవగా.. దరఖాస్తులు లక్ష దాటేశాయి. అర్థరాత్రికి పక్కాగా లెక్క తేలుతుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
చివరిరోజే 25 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. ఆ లెక్కన దరఖాస్తులకే సర్కార్కు 2 వేల కోట్ల రూపాయల ఆదాయం రానుంది.
శంషాబాద్, సరూర్నగర్లో మద్యం షాపుల కోసం భారీగా పోటీ నెలకొంది. అతి ఎక్కువగా దరఖాస్తులు ఈ ప్రాంతాల్లోనే వచ్చాయి. ఇప్పటికే శంషాబాద్, సరూర్నగర్లో పరిధిలో 8 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. నల్గొండ జిల్లాలో అప్లికేషన్లు 6 వేలు దాటగా… ఖమ్మంలోనూ దాదాపు 6 వేల దరఖాస్తులు వచ్చాయి.