ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ పరిణామం ఇది. విజయవాడలోని దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులతో అక్కడ మంతనాలు సాగించారు.
గతంలో చంద్రబాబు చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం విజయవాడలో జరిగే ముందు దేవినేని అవినాష్తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రేపు విజయవాడలోకి లోకేష్ యువగళం పాదయాత్ర ఎంట్రీ ఇస్తున్న సమయంలో దేవినేని అవినాష్తో జగన్ భేటీ కావడాన్ని స్థానిక నాయకులు గుర్తుచేస్తున్నారు.
మరోవైపు విజయవాడకు కొద్ది దూరంలోని గన్నవరంలో కమ్మ సామాజిక వర్గానికే చెందిన యార్లగడ్డ వెంకట్రావ్ కూడా కీలక సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ తనను పట్టించుకోవడం లేదని ఆయన తన అనుచరుల దగ్గర వాపోయారు. ఇదే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.