Telangana BJP (Telangana BJP News): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. శనివారం నుంచి వారం రోజులపాటు ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మేల్యేలు.. తెలంగాణలో పర్యటించనున్నారు. 119 నియోజకవర్గాల్లో యూపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఒక ఎమ్మెల్యే పర్యటించి.. పార్టీ కార్యకర్తలతో వర్క్ షాప్ నిర్వహించనున్నారు.
ఒక్కో రోజు ఒక్కో మండలంలో పర్యటించనున్న ఆయా ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ స్థాయి కోర్ కమిటీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. స్థానిక నేతలతో విడివిడిగా మాట్లాడతారు. సోషల్ మీడియా ఇన్ చార్జ్ లు, స్థానికంగా ప్రభావం చూపే నాయకులు, సంఘ్ పరివార్ కార్యకర్తలతో డిన్నర్ మీటింగ్ లలో పాల్గొంటారు.
మరోవైపు ‘సంపర్క్ సే సమర్థన్’ పేరిట వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఎస్సీ, ఎస్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లడం, ట్రేడర్ కమ్యూనిటీ, అమరుల కుటుంబాలతో మాట్లాడనున్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతోపాటు.. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి రిపోర్ట్ ను అధిష్టానానికి ఎమ్మెల్యేలు అందించనున్నారు.