Tirumala : తిరుమల సమాచారం
టీటీడీ పాలక మండలి ప్రయోగాత్మక నిర్ణయాలను తీసుకుంది. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేసింది. డిసెంబర్ ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయం మార్చుతోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని పరిశీలిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చెప్పారు
ఇక నవంబర్ 1 నుంచి తిరుపతిలో సర్వదర్శన టైం స్లాట్ దర్శన టోకెన్లు జారీ చేస్తారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల సర్వ దర్శన టోకెన్లు జారీ చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు జారీ చేస్తారు.టికెట్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు.
తిరుపతిలో కార్తీక దీపోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. నంద్యాల జిల్లా యాగంటిలో నవంబరు 7న, విశాఖపట్నంలో నవంబరు 14న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు.