శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని కోనేరులో చేపలు మృతి చెందడం కలకలంగా మారింది. కోనేరు నీటిలో ఉండలేక చేపలు బయటికి వచ్చి మరీ ప్రాణాలు విడుస్తున్నాయి.
చేపల మృతి మిస్టరీగా మారింది. ఆలయానికి అనుబంధంగా ఉండే నారద పుష్కరిణిలో చేపలు నిర్జీవంగా పడున్నాయి.
ఆడి మాసంలో కృత్తిక పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి నారద పుష్కరిణి వద్ద తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా అలానే జరిగింది. అనంతరం కోనేరులో తెప్పోత్సవం కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. చేపలు మృతి చెందడం మొదలైందని అంటున్నారు.
కోనేరులోని నీరు కలుషితం కావడం వల్లే చేపలు మృతి చెందాయని భక్తులు చెబుతున్నారు. చేపల మృతిపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఆలయ అధికారులు.. పాలకమండలి సరైన చర్యలు తీసుకోకపోవడమే చేపల మృతికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.