NRI Medical College : మంగళగిరి ఎన్.ఆర్.ఐ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి కామేపల్లి వెంకట ప్రణవ్ యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య వెనుక కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం చేసిన వేధింపులు ఉన్నట్లు తెలుస్తోంది.
కళాశాల నిర్దేశించిన ఫీజు చెల్లించినప్పటికీ.. అడ్మినిస్ట్రేటర్గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు.. అదనంగా ఫీజు చెల్లించాలని వత్తిడి చేయటంతోనే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. వేధింపులపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.