Pawan Kalyan: ఉత్తరాంధ్ర విధ్వంసం, దోపిడీపై జనసేనాని పోరుబాట పట్టారు. ప్రభుత్వ పెద్దల ఆక్రమణలపై ఉద్యమిస్తున్నారు. రిషికొండ, సిరిపురం భూముల తర్వాత భీమిలి ఎర్రమట్టి దిబ్బలను సందర్శించారు పవన్ కల్యాణ్. ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపదని.. వాటిని రక్షించుకోవాలని పిలుపు ఇచ్చారు.
1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు.. ఇప్పుడు కేవలం 292 ఎకరాలకే పరిమితమయ్యాయన్నారు పవన్. తెలంగాణలోనూ ఇలాగే దోచుకున్నారని.. ఇప్పుడు ఏపీపైన పడ్డారని విమర్శించారు. పర్యాటక శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వెంటనే పరిరక్షణ చర్యలు తీసుకోకపోతే.. కేంద్ర పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు పవన్ కల్యాణ్. అవసరమైతే గ్రీన్ ట్రైబ్యునల్కు వెళ్తామని చెప్పారు.
జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేసి.. రక్షణ కంచె నిర్మించాలని డిమాండ్ చేశారు జనసేనాని.