Electric bike : శ్రీ సత్యసాయి జిల్లా సడ్లపల్లిలో ఓ ఎలక్ట్రిక్ బైక్ పేలింది. పార్క్ చేసిన స్కూటీ అర్ధరాత్రిలో పెద్ద సౌండ్తో పేలిపోయింది. పేలుడు మంటల తీవ్రతకు ఇంట్లోని టీవీ, ఫర్నిచర్ కాలిపోయాయి.
మిడ్నైట్ కావడంతో గాఢ నిద్రలో ఉన్న ఇంట్లోవాళ్లు ఉలిక్కిపడ్డారు. ఛార్జింగ్ పెట్టకున్నా.. బైక్ ఎలా కాలిపోయిందనే విషయం అంతుపట్టడం లేదు. బాధితుడు ఎలక్ట్రిక్ స్కూటీ కొని ఆరు నెలలు అవుతోంది.
తన స్కూటీ కాలిపోవడానికి కంపెనీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు బైక్ ఓనర్. పరిహారంగా తనకు డబ్బులు కానీ, కొత్త స్కూటీ కానీ ఇవ్వాలని.. లేదంటే కేసు వేస్తానని చెబుతున్నాడు.