EPAPER
Kirrak Couples Episode 1

Bank Account : కస్టమర్ ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ.. జర జాగ్రత్త..

Bank Account : కస్టమర్ ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ.. జర జాగ్రత్త..
Bank Account


Bank Account : వినియోగదారుడి ప్రమేయం లేకుండా నకిలీ వేలిముద్రల సాయంతో, ఆధార్ కార్డు ఎనేబుల్ చేసుకుని బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ వేలిముద్రల తయారీ పరికరాలను సీజ్ చేశారు.

గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వేంకటేశు, అజయ్, కళ్యాణ్, షేక్ జానీ, గోపిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై దేశంలోని పలు రాష్ట్రాలలో సుమారు 416 AEPS నేరాలు చేసినట్లు విచారణలో తేలినట్లు జిల్లా ఎస్పి అన్బు రాజన్ వివరించారు.


సైబర్ నేరగాళ్ల వ్యవహారంపై సాంకేతికంగా నిఘా ఉంచడంతో గుంటూరు యూనియన్ బ్యాంక్ నుంచి డేటా సేకరించి, నిందితులు గుంటూరు జిల్లా నుంచి పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు పోలీసులు. వీరి బ్యాంకు ఖాతాల ద్వారా 5.9 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు విచారంలో తేలింది.

తెలుగు రాష్ట్రాల్లో లక్ష మందికిపైగా వేలిముద్రలు, ఆధార్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం నిందితుల దగ్గర ఉన్నట్లు గుర్తించారు. ఖాతాల్లో నగదు పోయిన బాధితులంతా ఫిర్యాదు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ సూచించారు.

Related News

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

Nagababu Comments: ఆ ఒక్క మాటతో జగన్, ప్రకాష్ రాజ్‌ల పరువు తీసేసిన నాగబాబు.. అందుకే పవన్ అలా స్పందించారట!

Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

Janasena: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

YSRCP: జనంపై కోపంతో ‘వరద’లకు దూరం.. జగన్ కటాక్షం కోసం అజ్ఞాతం వీడారా?

Big Stories

×