Chandrababu: విశాఖ ఆర్కే బీచ్.. మువ్వన్నెలు అద్దుకుంది. జాతీయ పతాకం రెపరెపలతో సందడిగా మారింది.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా విశాఖ ఆర్కేబీచ్లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు సమైక్య వాక్ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుతో పాటు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సమైక్య వాక్ను సక్సెస్ చేశారు.
జాతీయ జెండా చేత పట్టుకుని.. చంద్రబాబు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర పరేడ్ చేశారు. చంద్రబాబు వెంట భారీగా నగర ప్రజలు కదం కదం కదిపారు. సమైక్య వాక్ కోసం చంద్రబాబు.. విశాఖనే ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.
సమైక్య వాక్ అనంతరం.. 2047 విజన్ డాక్యుమెంట్ను చంద్రబాబు ఆవిష్కరించారు. వివిధ వర్గాలకు చెందిన మేధావులతో.. పలు అంశాలపై చర్చించారు. దేశంలోనో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ విశాఖ అన్నారు. భవిష్యత్తుపై ప్రణాళిక ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు చంద్రబాబు.