Police: అదునుచూసి పోలీసులకు ఝలక్ ఇచ్చారు దొంగలు. ఆగస్టు 15న పారిపోయి.. వారికి వారే స్వేచ్ఛ ప్రకటించుకున్నారు. కస్టడీలో ఉన్న దొంగలు పారిపోవడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. పరారీలో ఉన్న దొంగల కోసం వేట మొదటుపెట్టారు ఖాకీలు.
ములుగు జిల్లా మంగపేట పీఎస్లో జరిగిందీ ఘటన. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లలో పోలీసులు ఉండగా.. వారికళ్లు గప్పి ముగ్గురు నిందితులు స్టేషన్ నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది.
కమలాపురం సాయిబాబా ఆలయంలో చోరీ ఘటనలో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మూడు రోజులుగా స్టేషన్లోనే ఉంచి విచారిస్తున్నారు. అయితే పోలీసులు పంద్రాగస్టు వేడుకల నిర్వహణ ఏర్పాట్లలో ఉండగా.. అనుమానితుల్లో ముగ్గురు పరారీ అయ్యారు. పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు.