Independence day : దేశవ్యాప్తంగా 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై వరుసగా పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఘనత అందుకున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. మోదీ జెండా ఆవిష్కరణ చేస్తున్న సమయంలో హెలీకాప్టర్లు పూలవర్షం కురిపించాయి.
దేశంలోని వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు వేడుకలో పాల్గొన్నారు . 10 వేల మంది పోలీసులతో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. భద్రత కోసం 1000 సీసీ కెమెరాలు అమర్చారు.
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్లారు. జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వేడుకలను ప్రారంభించారు.