BRS: బీఆర్ఎస్కు గట్టి షాక్ కొట్టేలా కనిపిస్తోంది. పలువురు కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్న తరుణంలో.. ఓ సిట్టింగ్ ఎంపీ కూడా కారు దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. నాగర్కర్నూల్ ఎంపీ రాములు.. కాంగ్రెస్ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్.. రాములుతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి ఎంపీగా ఉన్న రాములు.. వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, ఆ నియోజకవర్గం నుంచి గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే ఆ టికెట్పై బీఆర్ఎస్ అధిష్ఠానం ఎంపీ రాములుకు స్పష్టత ఇవ్వలేదు.
తనకు ఎమ్మెల్యే టికెట్ రాదని భావించిన రాములు.. కొంతకాలంగా కారు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే తరుణంలో.. రాములుతో సునీల్ కనుగోలు టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. చర్చలు ఫలిస్తే.. బీఆర్ఎస్కు బిగ్ షాక్ తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.