Teacher: తెలుగు రాష్ట్రాల్లో కీచకులుగా మారుతున్నారు కొందరు టీచర్లు. అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయ్. విద్యార్థినులతో మసాజ్ చేయించుకుంటున్న లైబ్రేరియన్.. ఇంట్లో చెబితే టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు.. కేవీకి వచ్చి చితకబాదారు. గతంలో గుత్తి స్కూల్లోనూ లైబ్రేరియన్ ఇలాగే ప్రవర్తించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. బెజ్జూర్ ఆశ్రమ పాఠశాలలో బాలికలను లైంగికంగా వేధించాడు హెచ్ఎం పార్థరాం.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో విద్యార్థినిల పట్ల టీచర్ శంకర్ వెకిలిచేష్టలు చేస్తున్నాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ దారితప్పాడు. కూతురి లాంటి పిల్లలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ప్రిన్సిపాల్ను నిలదీశారు విద్యార్థినిల తల్లిదండ్రులు. వికృత చేష్టలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ పై షీటీమ్కు ఫిర్యాదు చేశారు బాధిత బాలికలు.