Car: బిర్యానీ కావాలని క్యాబ్ డ్రైవర్ని హోటల్కి పంపిన ఓ ప్రయాణీకుడు.. కారుతో సహా పరారైన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. హైదరాబాద్కు వెళ్లాలంటూ.. ఓ ప్రయాణీకుడు జహీరాబాద్ లో క్యాబ్ ఎక్కాడు. కారు పటాన్చెరు మండలంలోని రుద్రారం వద్దకు రాగానే తనకు ఆకలేస్తోందంటూ క్యాబ్ డ్రైవర్ కు చెప్పాడు. ఓ హోటల్ దగ్గర ఆపి బిర్యానీ తేవాలంటూ డ్రైవర్ ను పంపించాడు.
ప్రయాణీకుడి మాటలు నమ్మిన డ్రైవర్.. బిర్యానీ కోసం హోటల్ లోకి వెళ్లాడు. డ్రైవర్ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న ప్రయాణీకుడు వెంటనే కారును తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి హోటల్ నుంచి బయటకు వచ్చిన క్యాబ్ డ్రైవర్.. కారు కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దొంగను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.