EPAPER
Kirrak Couples Episode 1

YCP News : రుషికొండపై సచివాలయ నిర్మాణం.. వైసీపీ క్లారిటీ..

YCP News : రుషికొండపై సచివాలయ నిర్మాణం.. వైసీపీ క్లారిటీ..
YCP News

YCP News (Latest news in Andhra Pradesh) : విశాఖపట్నం రుషికొండ కొంతకాలంగా ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. ఈ కొండపై ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టడంతో వివాదం మొదలైంది. వైసీపీ ప్రభుత్వం ప్రకృతిని విధ్వంసం చేస్తోందంటూ టీడీపీ, జనసేన విమర్శలు గుప్పించాయి. శనివారం వైసీపీ అధికారిక ఖాతా నుంచి చేసిన ఓ ట్వీట్ పెను దుమారాన్ని రేపింది.


ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రకటించారని శనివారం చేసిన ట్వీట్ లో వైసీపీ పేర్కొంది. రుషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారని తెలిపింది. దానిపై కూడా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం ఆ పార్టీకి ఇష్టం లేదనిపిస్తోందని ఆ ట్వీట్‌లో విమర్శించింది. అయితే ఆదివారం వైసీపీ మరో ట్విస్ట్ ఇచ్చింది.

శనివారం రాత్రి చేసిన ట్వీట్‌ను వైసీపీ డిలీట్‌ చేసింది. రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతోందని పొరపాటున ట్వీట్ చేశామని వివరణ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరుగుతున్నాయని వైసీపీ తాజాగా ట్వీట్ చేసింది.


రుషికొండపై చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ ఒక్కరోజులోనే మాట మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ సచివాలయం నిర్మిస్తున్నారని వైసీపీ ట్వీట్ చేసిన వెంటనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వెనక్కి తగ్గిందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.

Related News

JANASENA vs TDP: ఆ ఎన్నికతో పిఠాపురంలో సీన్ రివర్స్ అయిందా.. జనసేన వర్సెస్ టీడీపీ.. ఏం జరుగుతోంది?

AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..

TTD Ex Chairman: చంద్రబాబుపై శివాలెత్తిన భూమన.. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్

Nagababu Comments: ఆ ఒక్క మాటతో జగన్, ప్రకాష్ రాజ్‌ల పరువు తీసేసిన నాగబాబు.. అందుకే పవన్ అలా స్పందించారట!

Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు

Janasena: సీఎం సీటుపై పవన్ ఫోకస్.. ప్లాన్-బి అమలు చేసే పనిలో జనసేనాని?

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×