Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చారు. ఇళ్లల్లో ఒంటరిగా నివసిస్తున్న మహిళలు, వృద్ధులకు వాలంటీర్ల పట్ల భయం ఏర్పడుతోందని పవన్ కల్యాణ్ అన్నారు.
విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ జగన్ పరిపాలన తీరుపై మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వ ఇటీవల పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటానని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్ని శాంతి భద్రతల సమస్యపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.