Maganti Gopinath : హైదరాబాద్ లో మరోసారి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులు రెచ్చిపోయారు. కృష్ణానగర్ లో వీరంగం సృష్టించారు. రాహూల్ అనే యువకుడి ఇంటిపై కర్రలు, రాడ్లతో 20 మంది గోపీనాథ్ అనుచరులు దాడి చేశారు. ఆ మార్గంలో వెళ్తున్న వాహనాల పై కూడా దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గుర్తు చేశారు.
గతంలోనూ బోనాల సందర్భంలో సొంత పార్టీ కార్యకర్తపైనే గోపీనాథ్ సహా ఆయన అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఫ్లెక్సీలో తన ఫోటో చిన్నగా ముద్రించడంపై మాగంటి గోపీనాథ్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఏకంగా కార్యకర్త ఇంటికి వెళ్లి మరీ అరాచకం సృష్టించారు.