Telangana: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు సీరియస్ అయింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై పోలీసుల తీరును తప్పుబట్టింది.
ఎన్నికల అఫిడమిట్ ట్యాంపరింగ్ చేశారని మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గౌడ్ సహా పదిమందిపై కేసు నమోదుకు ఆదేశించింది. కేసు నమోదు చేయలేదని పిటిషనర్ రాఘవేందర్ రాజు అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్పై విచారణ జరిపిన కోర్టు.. కేసు నమోదు చేశారో లేదో చెప్పాలని పీపీని కోర్టు ఆదేశించింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు చేయకపోతే కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తామని వ్యాఖ్యానించింది. కేసు నమోదు చేస్తే ఎఫ్ఐఆర్ సమర్పించాలని ఆదేశించింది.