Indo Pak Border : స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబవుతోంది. ఇప్పటికే ఎర్రకోట, రాజ్ఘాట్, ITO పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఈ మూడు ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉన్నాయని.. ఈ ప్రాంతాల్లో ప్రజలు గూమికూడటాన్ని అనుమతించమని పోలీసులు తెలిపారు. కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోవైపు ఎర్రకోటలో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ను నిర్వహించాయి త్రివిధ దళాలు. భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు.. మాక్ పరేడ్ నిర్వహించారు. ఆర్టిలరీని ఫైర్ చేశారు.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అటు, ఇండియా-పాకిస్థాన్ బార్డర్లో ఆపరేషన్ అలర్ట్ పేరుతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించనుంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. శుక్రవారం నుంచి ఈ నెల 17 వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు. చెక్ పాయింట్లు, పెట్రోలింగ్.. పెంచామని తెలిపారు.