IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను సవరిస్తూ 3 బిల్లులు తెచ్చింది కేంద్రం. లోక్ సభలో బిల్లులను అమిత్ షా ప్రవేశపెట్టారు. క్రిమినల్ చట్టాల్లో భారీ మార్పులు చేశారు. సీఆర్పీసీ బదులుగా ‘భారతీయ న్యాయ సంహిత’ అనే చట్టాన్ని తెచ్చారు. ఐపీసీ బదులుగా ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’.. ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా ‘భారతీయ సాక్ష్య బిల్’లును తీసుకొచ్చింది కేంద్రం. అయితే ఈ మూడు బిల్లులలోనూ ఇండియా అనే పదం లేకుండా భారతీయతను చొప్పించడం రాజకీయంగా ఆసక్తికరం.
కొత్త చట్టాల ప్రకారం.. మూక దాడులకు ఏడేళ్లు, గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్లు, మైనర్పై రేప్ కేసులలో మరణ శిక్ష పడుతుంది. బిల్లుపై మరింత చర్చించేందుకు స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేశారు.
ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లు బ్రిటిష్ కాలంనాటి చట్టాలని.. ఆంగ్లేయుల పాలనను బలోపేతం చేసేలా.. ఎదురుతిరిగిన వారిని శిక్షించేలా ఆ చట్టాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదని.. ఇప్పటికీ ఆవే పాత చట్టాలను పాటిస్తుండటం కరెక్ట్ కాదనే అభిప్రాయంతో.. సరికొత్త భారతీయ చట్టాలను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. రాజద్రోహం వంటి చట్టాలను తొలగిస్తోంది.
ఈ కొత్త చట్టాలు భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయని.. శిక్ష వేయడమే కాకుండా.. న్యాయం జరిగేలా చేయడం వీటి లక్ష్యమని.. బిల్లులను ప్రవేశపెట్టే సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. కొత్త చట్టాలతో 90 శాతంపైగా నేరగాళ్లకు శిక్షలు ఖాయమన్నారు.