Bank Account : గత ఐదేళ్ల కాలంలో సుమారు రూ.35వేల కోట్లు వివిధ బ్యాంకులు కస్టమర్ల నుంచి కొల్లగొట్టాయి. మినిమమ్ బ్యాలెన్స్లు లేకపోవడంపై పెనాల్టీలు, అదనపు ఏటీఎం లావాదేవీలు, SMS సేవలపై ఛార్జీల రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్కు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ ఈ వివరాలను లిఖితపూర్వకంగా ప్రకటించారు.
HDFC, ICICI, IDBI వంటి ప్రైవేట్ బ్యాంకులతో పాటూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ మొత్తాన్ని ఖాతాదారుల నుంచి వసూలు చేశాయి. ఐదేళ్లలో చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తం 35వేల కోట్ల రూపాయల్లో.. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడంపై విధించే చార్జీల రూపంలో అత్యధికంగా ఉన్నాయి. ఈ కారణంగానే ఏకంగా 21వేల 44కోట్ల రూపాయలను వసూలు చేశాయి. అదనపు ఏటీఎం లావాదేవీల ఛార్జీల పేరిట 8వేల 289కోట్లు, SMS సేవల కోసం 6వేల 254 కోట్ల రూపాయలు వసూలు చేశాయి.